News April 11, 2025

బిక్కనూర్: కుటుంబ కలహాలతో సూసైడ్

image

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన నర్సింలు తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు. నర్సింలు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 16, 2026

చంద్రబాబు, లోకేశ్ తప్పకుండా అనుభవిస్తారు: పెద్దిరెడ్డి

image

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని MLA పెద్దిరెడ్డి అన్నారు. నెల్లూరు జైలులో పిన్నెల్లిని ఇవాళ MP మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. హత్య కేసులో అసలైన నేరస్థులను వదిలి పిన్నెల్లిపై అక్రమ కేసు మోపారు. దీనికి ప్రతిఫలం CBN, లోకేశ్ అనుభవిస్తారు’ అని పెద్దిరెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదని YCP హయాంలో ఇలాంటి చర్యలే రిపీట్ అయితే సహించగలరా అని MP ప్రశ్నించారు.

News March 16, 2026

దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

News March 16, 2026

ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

image

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!