News April 11, 2025

మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

‘మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్‌లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.

News January 13, 2026

మెదక్: జాగ్రత్తగా గాలిపటాలు ఎగరవేయాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రజలంతా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సంబరమని, అయితే ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

News January 13, 2026

తూప్రాన్: ఎమ్మెల్సీకి శుభాకాంక్ష లేఖలు అందజేత

image

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డికి విద్యుత్ శాఖ తరపున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు లేఖలను మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ అందజేశారు. ఎమ్మెల్సీకి గృహజ్యోతి పథకం, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. డీఈ టెక్నికల్ విజయ శ్రీనివాస్, తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ కమర్షియల్ రాజు పాల్గొన్నారు.