News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

పిడుగుపాటుకు కొండాపూర్లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 19, 2025
కొల్లాపూర్లో ప్రజల నుంచి వినతుల స్వీకరించిన మంత్రి

కొల్లాపూర్ పట్టణంలోని కేఎల్ఐ గెస్ట్ హౌస్లో శనివారం ఉదయం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి జూపల్లి వినతులు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగొద్దన్నారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 19, 2025
పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు.
News April 19, 2025
పాలమూరు: సాహితీవేత్తలకు పుట్టినిల్లు ఆ గ్రామం..!

NGKL జిల్లా వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం ఉద్యమకారులు, అభ్యుదయ సాహితీవేత్తలకు పుట్టినిల్లు. 1956లో కల్వకుర్తి ప్రాంతం నుంచి వెలువడిన గడ్డిపూలు కథ సంపుటిలో కథలు రాసిన ఏడుగురు రచయితల్లో ఇద్దరు రచయితలు కోట్ల సంపత్ రావు, కోట్ల చలపతిరావు ఈ గ్రామానికి చెందిన వారే. సంపత్రావు 1975 ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ ఖైదీగా దాశరథి కృష్ణమాచార్య, మాకినేని బసవవున్నయ్యతో కలిసి 16నెలలు రాజమండ్రిలో జైలులో ఉన్నారు.