News April 11, 2025

కొల్లిపర: బాలికపై అత్యాచారయత్నం. 20ఏళ్ల జైలు శిక్ష 

image

కొల్లిపురం మండలం దావులూరుకి చెందిన పి. సురేశ్ (53) 4ఏళ్ల బాలికపై 2021లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి కొల్లిపర ఎస్ఐ బలరామిరెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన దిశా ఎస్ఐ సంజయరాణి ఆధారాలు సమర్పించగా, తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు.      

Similar News

News September 11, 2025

ANUలో ఈ నెల 17న క్విజ్ పోటీలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 17న క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ తెలిపారు. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.3 వేల నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.

News September 11, 2025

AP CRDAకు అవార్డు

image

APCRDAకు GIS, RSA రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ టెక్నాలజీల వినియోగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన Best User Organization అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన Esri India సంస్థ వార్షిక యూజర్ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజేంద్ర కుమార్ ఈ అవార్డును అందజేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో జియోస్పేషియల్ టెక్నాలజీని సృజనాత్మకతో సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు లభించింది.

News September 11, 2025

నేపాల్‌లో చిక్కున్న AP వాసులను తీసుకొచ్చేలా చర్యలు

image

నేపాల్‌లో చిక్కున్న AP వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను వెలగపూడిలోని సచివాలయం RTGSలో  మంత్రులు అనిత, నారా లోకేశ్ సమీక్షిస్తున్నారు. నేటి సాయంత్రం లోగా AP వాసులను విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ, AP భవన్ అధికారులతో చర్చిస్తున్నారు. విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్వాగతం పలకాలని లోకేష్ ఆదేశించారు.