News April 11, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవం.. భారీ బందోబస్తు

ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నలుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
News January 12, 2026
కడప జాయింట్ కలెక్టర్గా నిధి మీనా

కడప జాయింట్ కలెక్టర్గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.


