News April 11, 2025
జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం అల్లీపూర్లో అత్యధికంగా 40.9℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు జైన 40.8, మారేడుపల్లి 40.7, వెల్గటూర్, గోదూరు 40.5, ఐలాపూర్ 40.4, సారంగాపూర్, మెట్పల్లి 40.2, ధర్మపురి, మేడిపల్లి 40.1, రాయికల్ 40.0, ఎండపల్లి, మల్లాపూర్, సిరికొండ, నేరెల్ల, రాఘవపేటలో 39.4℃ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగానే ఉంది.
Similar News
News January 12, 2026
తూ.గో: అన్నను హత్య చేసిన తమ్ముడు.. UPDATE

నిడదవోలు(M) అట్లపాడులో సత్యనారాయణ(28) తన తమ్ముడు చేతిలో <<18834193>>హత్య<<>>కు గురైన సంగతి తెలిసిందే. సత్యనారాయణ బీటెక్ చదివి ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మద్యంమత్తులో తల్లి, తమ్ముడు సాయిరాంతో వాగ్వాదానికి దిగగా..కోపోద్రిక్తుడైన సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ మృతి చెందాడు. సమిశ్రగూడెం SI బాలాజీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 12, 2026
సిరిసిల్ల: సంక్రాంతికి గ్రామాల్లో వెలుగులు

సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ వెలుగులు నింపనున్నాయి. నూతన పాలకవర్గాలు గ్రామంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాయి. పాడైన విధి దీపాలతో పాటు, లేనిచోట్ల కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో హైమాస్ లైట్లను కూడా రిపేర్ చేయిస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతికి గ్రామాల్లో వెలుగులు విరజిమ్మ నుండగా ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 12, 2026
ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు

ఏపీలో 14మంది IASలను బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా JCగా కల్పనకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్గా మయూర్ అశోక్, తిరుపతి JC, తుడా వైస్ ఛైర్మన్గా గోవిందరావు, కడప JCగా నిధి మీన, అనంతపురం JCగా విష్ణుచరణ్, అనకాపల్లి JCగా సూర్యతేజ, చిత్తూరు JCగా ఆదర్శ్ రాజేంద్రన్.


