News April 11, 2025

దెందులూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

దెందులూరు మండలం కొమరేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిడమర్రు గ్రామానికి చెందిన బాపన్న(55) పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. దగ్గరి బంధువు అయిన గరిమెళ్ల అప్పారావుతో కలిసి బాపన్న బైక్‌పై బయలుదేరారు. కొడుకు పెళ్లికి సంబంధించి బంధువులకు శుభలేఖలు ఇచ్చి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది.

Similar News

News March 19, 2026

నెల్లూరు: గిరిజన పథకాలపై సమీక్ష

image

నెల్లూరు జిల్లాలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, కలెక్టర్ హిమాన్షు శుక్లా హాజరయ్యారు. జిల్లాలో యానాదుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ITDA ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ రావు వివరించారు. ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.

News March 19, 2026

అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

image

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్‌లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్‌కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.

News March 19, 2026

ADB: పల్లెల్లో ఉగాది సందడి.. పులగం, గుడాల నైవేద్యం!

image

ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రకృతితో ముడిపడి ఉన్న పురాతన సాంప్రదాయాలు నేటికీ సజీవంగా కనిపిస్తున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా రైతులు పశువుల కొట్టాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త బియ్యం, పెసరపప్పుతో చేసిన ‘పులగం’ వండి పశువులకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మోదుగు పోర్కలతో చేసిన వంటకాలను, గుడాలను అందరికీ పంపిణీ చేసి పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటున్నారు.