News April 11, 2025

శంకరపట్నం: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శంకరపట్నం(M) తాడికల్ గ్రామశివారులో KNR-WGL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గర్రెపల్లికి చెందిన కౌడగాని కిషన్ రావు, భార్య శోభ, కూతురు అశ్విని బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శోభ చికిత్స పొందుతూ మృతి చెందింది. శోభ తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు SI రవి తెలిపారు.

Similar News

News April 21, 2025

శాతవాహనలో ఉర్దూ విభాగంలో ఆశ్రా తస్నీమ్‌కి పరిశోధక పట్టా

image

SUలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని ఉర్దూ విభాగంలో డాక్టరేట్ డిగ్రీని పరిశోధక విద్యార్థిని ఆశ్రా తస్నీమ్‌ కి అందజేశారు. “హైదరాబాద్ మే కాథూన్ షోరా అజాదీ కే బాద్ మే” అనే పరిశోధక అంశం తీసుకొని నజిముద్దిన్ మునావర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి మౌఖిక పరీక్షలో నిరూపించించిన గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేష్ కుమార్ తెలిపారు.

News April 21, 2025

కరీంనగర్: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 20, 2025

కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

image

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.

error: Content is protected !!