News April 11, 2025
బీబీనగర్లో రాకెట్ సామాగ్రి తయారీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్లో వినియోగించనున్న ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫొమ్ ప్యాడ్లతో పాటు ఇతర ముడి సామగ్రిని బీబీనగర్ మండలం జమీలపేట గ్రామంలోని వీఎన్డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో తయారు చేశారు. గురువారం రాకెట్ సామగ్రిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ పరిశోధన కేంద్రానికి తరలించారు.
Similar News
News September 17, 2025
అనకాపల్లి: ‘8ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు’

కొత్తకోట, రావికమతం పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4కేసుల్లో నిందితుడు 8ఏళ్ల తర్వాత చిక్కాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసు నమోదు కాగా ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్లోని భవానినగర్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న అతనిని తమ సిబ్బంది అరెస్టు చేయగా రిమాండ్కు తరలించామన్నారు.
News September 17, 2025
17 నుంచి పోషణ మాసొత్సవాలు: సీతక్క

జీవనశైలి మార్పుల సవాళ్లు ఎదుర్కొనేందుకు పోషకాహారం ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార శాఖ ఫొటో ఎగ్జిబిషన్, పోషణ మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
News September 17, 2025
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.