News April 11, 2025

హన్మకొండ: ఉరేసుకొని సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాజీపేటలో జరిగింది. SI నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సంజయ్ కుమార్(26) కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే కాజీపేటలోని బాపూజీనగర్ కాలనీలో మూడు నెలల క్రితం రూ.76లక్షలతో ఇల్లు కొన్నాడు. దీంతో అప్పులు, వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురై అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 16, 2026

రేపు మేడారం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ ప్రమాణస్వీకారం

image

మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా తాడ్వాయి మండలానికి చెందిన ఈర్పా సుకన్యను ప్రభుత్వం నామినేట్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మేడారంలోని సమ్మక్క భవన్‌లో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 16, 2026

జగిత్యాల కలెక్టరేట్‌లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 16, 2026

కౌన్సిలింగ్ కోసం AP RCET అభ్యర్థుల ఎదురుచూపులు

image

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD ప్రవేశాల కోసం గత ఏడాది నవంబర్‌లో తిరుపతి SPWU ఆధ్వర్యంలో AP RCET పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 15న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు వస్తాయేమో అని అర్హత సాధించిన అభ్యర్థులకు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి AP RCET కౌన్సిలింగ్, అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.