News April 11, 2025

పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేస్తామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

Similar News

News March 24, 2026

వరంగల్ జిల్లాలో టీబీ కేసులు.. వైద్యుల సూచనలు

image

జిల్లాలో టీబీ (క్షయ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 73,991 మందికి పరీక్షలు చేయగా 1,260 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,780 మందికి పరీక్షలు నిర్వహించగా 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు 876 మంది చికిత్స పొందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

WGL: రైతన్నకు ‘భరోసా’.. ఖాతాల్లో నిధుల జమ

image

యాసంగి సాగుకు సంబంధించి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ జిల్లాలో తొలి విడతగా ఎకరం లోపు భూమి ఉన్న 1,55,169 మంది రైతుల ఖాతాల్లో రూ.75.95 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈ సాయం విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News March 23, 2026

పది పబ్లిక్ పరీక్షలకు WGL జిల్లాలో 99.86% హాజరు

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..