News April 11, 2025

BIG NEWS.. ఇంటర్ ఫలితాలపై కాసేపట్లో ప్రభుత్వ ప్రకటన?

image

AP: ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫలితాల విడుదల చేసే తేదీని అధికారులు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తికాగా, 2-3 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలను bieap.gov.in, Way2Newsలో సులభంగా తెలుసుకోవచ్చు.

Similar News

News April 19, 2025

అప్పుడూ.. ఇప్పుడూ ఒకే స్కోరు, ఒకే రిజల్ట్

image

చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో మ్యాచులో RCB ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది.

News April 19, 2025

నేటి నుంచి 10 రోజులు..

image

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News April 19, 2025

విజయసాయికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

image

AP: వైసీపీ కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా? మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే’ అని స్పష్టం చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు.

error: Content is protected !!