News March 27, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,900 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News April 1, 2026
2.37 లక్షల మె.ట ధాన్యం కొనుగోలు ప్రణాళిక: అ.కలెక్టర్

రబీ (యాసంగి) సీజన్ 2025-26 నందు ఖమ్మం జిల్లాలో 2 లక్షల 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రబీ ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు కనీసం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
News April 1, 2026
ఖమ్మం: ఆటో బోల్తా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం

బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందారు. శంషాబాద్లో పనిచేస్తున్న నంబి ఫణిందర్(31) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా.. కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులోని శ్రీనిధి వెంచర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఫణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సూరజ్ కేసు నమోదు చేశారు.
News April 1, 2026
ఖమ్మం: ఆటో బోల్తా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం

బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందారు. శంషాబాద్లో పనిచేస్తున్న నంబి ఫణిందర్(31) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా.. కొణిజర్ల మండలం తనికెళ్ల శివారులోని శ్రీనిధి వెంచర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఫణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సూరజ్ కేసు నమోదు చేశారు.


