News April 11, 2025
BREAKING: రేపు ఇంటర్ రిజల్ట్స్

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాలను అందరికంటే ముందుగా వే2న్యూస్లో పొందవచ్చు.
– వే2న్యూస్ యాప్లో వచ్చే స్పెషల్ స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కితే చాలు. సెకన్లలో ఫలితాలు వస్తాయి. డౌన్లోడ్ అని మరొక్క క్లిక్ చేస్తే రిజల్ట్ కార్డ్ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
Similar News
News April 19, 2025
ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

ఇరాన్పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.
News April 19, 2025
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
News April 19, 2025
ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్కు చెందిన టెస్లా, స్టార్లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.