News April 11, 2025
అన్నమయ్య జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 28,602 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 14,855 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 13,747 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News January 7, 2026
అలారం పెట్టుకునే అలవాటు ఉందా?

అలారం శబ్దంతో నిద్ర లేవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మెదడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా అలారం సౌండ్ రావడం వల్ల బీపీ పెరిగే ఛాన్స్ ఉందని, గుండె సంబంధ వ్యాధులూ వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. మాటిమాటికి స్నూజ్ నొక్కడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని రోజంతా అలసటగా అనిపిస్తుందని తెలిపారు. సహజంగా ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 6, 2026
శ్రీవాణి దర్శన టికెట్లు ఇక ఆన్లైన్లోనే

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్లైన్లో జారీ చేయడాన్ని TTD నిలిపేసింది. ఈ నెల 9 నుంచి రోజూ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో 800 టికెట్లను కేటాయించనుంది. ఉ.9 గంటలకు విడుదల చేయనుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సా.4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఈ విధానాన్ని నెల రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒక కుటుంబానికి నలుగురు(1+3) సభ్యులకే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది.
News January 6, 2026
మన నీటి సమస్యపై సరైన రీతిలో వాదన వినిపించాలి: మాధవ్

ఏపీకి రావాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చెయ్యాలని, బలమైన వాధన వినిపించాలన్నారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపే ముందు, ప్రయాణికుల రాకపోకల సరళి, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిపై రాబడి వంటి అనేక అంశాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంగళవారం తెలిపారు.


