News April 11, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠలో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోనే 1వ సంవత్సరం 35,688, 2వ సంవత్సరం 35,946మంది మొత్తం 71,634 మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News November 6, 2025
GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
News November 6, 2025
సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్గా పనిచేశారు.
News November 6, 2025
గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


