News March 27, 2024

మద్నూర్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు చోరీ

image

ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మద్నూరులో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. మద్నూరుకు చెందిన మహజన్ బాలాజీ ఈనెల 26న సాయంత్రం ఇంటికి తాళం వేసి మార్కెట్‌లో సరుకులు కొనుగోలు కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8:45 ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 25 తులాల బంగారం, రూ.16వేలు ఎత్తుకెళ్లారని బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News September 8, 2025

NZB: ఈ నెల 10న తుది ఓటరు జాబితా

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News September 8, 2025

NZB: రెండు కార్లు ఢీ

image

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

News September 7, 2025

నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

image

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.