News April 11, 2025

భూపాలపల్లి: సెల్ ఫోన్ సిగ్నల్ రావాలంటే చెట్లు ఎక్కాల్సిందే!

image

మహాముత్తారం మం.లోని యత్నారంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ రావాలంటే ఎత్తైన ప్రదేశం లేదా చెట్లైనా ఎక్కాలి. లేదా ట్రాక్టర్ ట్రాలీపై నిల్చొని మాట్లాడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో సెల్ టవర్ నిర్మించాలని, లేదా సమీప టవర్ సిగ్నల్ పరిధినైనా పెంచాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో సిగ్నల్ ఎలాఉందో కామెంట్ చేయండి.

Similar News

News January 13, 2026

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.

News January 13, 2026

నిమ్మకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తే మేలు

image

నిమ్మలో పూత, పిందె, పండు అభివృద్ధి దశలో తప్పనిసరిగా నీరు అందించకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ తోటలకు డ్రిప్ ద్వారా నీరు అందించడం మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల 14-25% వరకు నీరు ఆదా అవడంతో పాటు కలుపు 30% తగ్గుతుంది. నీటిలో తేమ ఎక్కువ రోజులుండి కాయ నాణ్యత, దిగుబడి పెరిగి తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించవచ్చు. దీని వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.

News January 13, 2026

భారీ జీతంతో 260 పోస్టులకు నోటిఫికేషన్

image

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 24 -FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25L చెల్లిస్తారు. * మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.