News April 11, 2025
రేపే రిజల్ట్.. ఏలూరు జిల్లాలో విద్యార్థులు ఎదురు చూపు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏలూరు జిల్లాలో 32,411 మంది ఇంటర్ విద్యార్థులు రాయగా వీరిలో ప్రథమ సంవత్సరం 18,195, ద్వితీయ సంవత్సరం 14,216 విద్యార్థులు పరీక్షల రాశారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 18, 2026
త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
News March 18, 2026
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం: సీఎం

TG: అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై చర్చ జరగాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు హాజరుకాకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రైజింగ్ తెలంగాణ-2047 డాక్యుమెంట్ను కూడా ప్రతిపక్ష సభ్యులు చదవలేదని విమర్శించారు.
News March 18, 2026
హార్ముజ్ సమస్య మీకే వదిలేయనా?: ట్రంప్

హార్ముజ్ జలసంధి క్లియరెన్స్కు మిత్ర దేశాలు కలిసిరాకపోవడంతో ఒత్తిడిని పెంచేందుకు US అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. ఇరాన్లో తమ పని పూర్తి చేసి(దాడులు) హార్ముజ్ విషయాన్ని దానిపై ఆధారపడిన దేశాలకే వదిలేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. దీంతో ఈ సమస్యపై స్పందించని దేశాలు ఇప్పటికైనా చర్యలకు దిగుతాయని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో తన విజ్ఞప్తికి నిరాకరించిన ఐరోపా, ఆసియా దేశాలకు హెచ్చరికలు పంపినట్లైంది.


