News April 11, 2025

విశాఖ-కిరండూల్ పాసింజర్ అరకు వరకే

image

విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ అరకు వరకే నడుస్తాయని వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. కేకే లైన్‌లోని పాడువ – దార్లిపుట్ మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో‌ విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) రైలు ఏప్రిల్ 14 నుంచి 22 వరకు విశాఖ నుంచి అరకు వరకే నడుస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ పాసింజర్ (58502) రైలు ఈ నెల 14 నుంచి 22 వరకు అరకు నుంచి విశాఖ వెళ్తుందన్నారు.

Similar News

News September 17, 2025

సిబ్బందిని అభినందించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

image

కామారెడ్డి: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన SDRF సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో SDRF సిబ్బంది, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరదల సమయంలో వారు చేసిన సేవలను కొనియాడారు. జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News September 17, 2025

జగిత్యాల : స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు అవగాహన

image

SKNR ఆర్ట్స్, సైన్స్ కళాశాల జగిత్యాలలో మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ సెక్యూరిట్స్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్(SEBI) నిపుణులు M.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెట్టుబడులు పెట్టేముందు ఫండమెంటల్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.

News September 17, 2025

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ రత్న షీలామణి

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.