News April 11, 2025
గద్వాల: హనుమాన్ శోభాయాత్రకు ఎంపీకి ఆహ్వానం

జోగులాంబ గద్వాలలో ఈనెల 12న జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, బీజేపీ నాయకులు మీర్జా పురం వెంకటేశ్వర రెడ్డి, సంజీవ్ అయ్యా, కృష్ణం రాజు, రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.
News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
News November 7, 2025
తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


