News April 11, 2025

వనపర్తి: ‘ఫులే ఆశయ సాధన కోసం కృషి చేయాలి’

image

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాఫులే అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫులే జయంతి వేడుకలను హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఫులే చిత్రపటానికి రావుల పూలమాల వేసి నివాళులర్పించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిషోర్, తుంగ బాలు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 2, 2026

జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

image

AP: అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, అందుకే వింత పేరు తీసుకొచ్చారని CM CBN విమర్శించారు. మావిగన్ పేరు పెట్టాలనడం ద్వేషానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అమరావతిపై ఆయన వైఖరి మారదని స్పష్టమైందని కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు. రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని, తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో పాల్గొంటానని చెప్పారు.

News April 2, 2026

అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి నేడు సీఎం రాక

image

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో 2015 అక్టోబర్ 22న ప్రధాన మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు ఉద్దండరాయపాలెం శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటున్నారు.

News April 2, 2026

గుడిబండ తహశీల్దార్ ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

image

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహశీల్దార్ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అక్రమ ఆస్తులను గుర్తించారు. తనిఖీల్లో రూ.55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి, రూ.24 లక్షల బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలు ఇళ్ల పత్రాలు కూడా లభించాయి. నిందితుడిని నేడు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.