News April 11, 2025

మరికల్: ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయాల తరలింపు ముహూర్తం ఫిక్స్

image

మరికల్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలతో పలు కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ మండల్ కాంప్లెక్స్‌కు శనివారం తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 21న ప్రారంభించిన మండల కాంప్లెక్స్ ఇండికేటర్ కార్యాలయంలో నీటి సమస్య ఏర్పడడంతో కార్యాలయాల తరలింపు బ్రేక్ పడింది. ఇట్టి కార్యాలయాలల్లో శుక్రవారం నూతన బోరును వేసేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 15, 2025

విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈనెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది.

News November 15, 2025

ఏలూరు: నడిరోడ్డుపై భార్య హత్య.. భర్త అరెస్ట్

image

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద <<18282978>>గురువారం మధ్యాహ్నం నూజివీడులోని అజరయ్యపేటకు చెందిన సరస్వతిని<<>> ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.

News November 15, 2025

పెరుగుతున్న చలి.. జాగ్రత్తలు పాటించండి: DMHO

image

చలి తీవ్రత పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని MHBD జిల్లా ఆరోగ్య వైద్యాధికారి రవి రాథోడ్ తెలిపారు. చలికాలంలో వచ్చే వ్యాధులలో జ్వరం, జలుబు, దగ్గు మొదలగు ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందన్నారు. చిన్నారులతో ఉదయం ప్రయాణం చేయకూడదని, రాత్రి వేళలో చల్లగాలి ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసి వేయాలన్నారు. వేడినిచ్చే హై వోల్టేజ్ బల్బులు వాడాలన్నారు. శీతల పానీయాలు తాగొద్దని సూచించారు.