News April 11, 2025
సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం: మంత్రి ఉత్తమ్

TG: సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో 2.8కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని, తాము 3.10కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రెస్ హయాంలో పడిందని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్ రూల్లో కోర్టు జోక్యం చేసుకోలేదు.
News September 15, 2025
‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.
News September 15, 2025
రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

TG: హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.