News April 11, 2025

కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

image

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది భక్తులు తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్త జనం పులకించిపోయారు.

Similar News

News July 11, 2025

నాగార్జునసాగర్‌లో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ కేంద్రంలో నేటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు. సాగర్ ప్రధాన పవర్ హౌస్, ఎడమ కాలువ పవర్ హౌస్, అక్కంపల్లి రిజర్వాయర్‌ను హైడల్ డైరెక్టర్ బాలరాజు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ ఏడాది 163 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పాదన చేయాల్సి ఉండగా అవసరానికి అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.

News July 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 11, 2025

NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.