News April 11, 2025
పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.
Similar News
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.
News July 7, 2025
వర్ధన్నపేట వైపే స్వర్ణ చూపు..!

వర్ధన్నపేట నియోజకవర్గం పదేళ్ల పాటు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. కానీ వినూత్న పరిణామాల వల్ల ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానం జనరల్గా మారుతుందనే ఊహాగానాలతో వరంగల్ నగర మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చూపు తన తన సొంత నియోజకవర్గ కేంద్రంపై పడిందనే చర్చ జరుగుతోంది.
News July 7, 2025
HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.