News April 12, 2025

వనపర్తి: భూసేకరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి పూర్తిచేసేందుకు మిగిలిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ, భూ నిర్వాసితుల పునరావాస ఏర్పాట్ల పై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుద్ధారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించిన భూసేకరణపై చర్చించారు.

Similar News

News September 16, 2025

జగిత్యాల: ‘విద్యార్థులకు సాంకేతిక విద్యను బోధించాలి’

image

విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యను బోధించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని మంగళవారం అయన సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేయడానికి టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట డీఈవో రాము తదితరులు ఉన్నారు.

News September 16, 2025

జగిత్యాల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో గల ఈవీఎం గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రతతో ఉండాలని, అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్ తదితరులున్నారు.

News September 16, 2025

పుట్ట మధు ఇంటి ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

image

మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచికల్ పేట గ్రామంలో సోమవారం స్వర్గీయ శ్రీపాద రావు, మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. అనంతరం పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో అంబేడ్కర్, శ్రీపాద రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు.