News April 12, 2025
MNCL: ‘సంక్షేమ, అభివృద్ధి పనులను సమర్థంగా నిర్వహించాలి’

జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పని చేసి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని మంచిర్యాల కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. 2025 పూర్తయ్యేలోగా క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీలుగా మార్చాలని ఆదేశించారు.
Similar News
News January 16, 2026
జగద్గిరిగుట్టలో దారుణ హత్య

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్నగర్లో నిన్న సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని (17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపూర్ జిల్లా వాసి పవన్ కుమార్ (25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
KNR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యాంప్ కార్యాలయంలో గురువారం సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించగా, సిబ్బంది పండుగ వాతావరణంలో పాల్గొన్నారు.


