News April 12, 2025

NGKL: సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం: ఎస్పీ

image

సళేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందిన సళేశ్వర జాతరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం, ఆహార వితరణ, క్యూలైన్ దర్శనం, మెడికల్ ఎమర్జెన్సీ, CC కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ గురించి సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు.

Similar News

News February 26, 2026

రేపటి వరకు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీ ప్రాంతంలో ఇవాళ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 26, 2026

మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

image

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.

News February 26, 2026

అనకాపల్లి: 217 మంది విద్యార్థులు గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం. వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.