News April 12, 2025
తిరుపతి ప్రజలకు గమనిక

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News March 30, 2026
పెంచలకోనలో వైభవంగా వసంతోత్సవాల ప్రారంభం

పెంచలకోన క్షేత్రంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం,రక్షాబంధనం,అంకురార్పణ హోమం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణం రద్దు చేయబడుతుంది. తిరిగి ఏప్రిల్ 3 నుంచి యథావిధిగా నిత్య కళ్యాణం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.
News March 30, 2026
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశాల్లో 10 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఒక ముఖ్యమైన బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయగా, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. బడ్జెట్ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
News March 30, 2026
శరవేగంగా ఉస్మానియా, హైకోర్టు కొత్త భవనాల పనులు: కోమటిరెడ్డి

ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు కొత్త భవనాల నిర్మాణ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా HYD నలువైపులా మొత్తం రూ.8,000 కోట్ల వ్యయంతో నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు. సనత్నగర్లో రూ.2,000 కోట్లతో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి మొదటి దశ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని, మెరుగైన వైద్యమే తమ లక్ష్యమన్నారు.


