News April 12, 2025

రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో RRRకు వీడ్కోలు

image

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సాదర వీడ్కోలు లభించింది. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కూటమి నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Similar News

News December 27, 2025

యూపీలో 2.89కోట్ల మంది ఓటర్లు తొలగింపు!

image

ఉత్తర్ ప్రదేశ్‌లో SIR గడువు నిన్నటితో ముగియగా DEC 31న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో 15.44కోట్ల మంది ఓటర్లకు గానూ 2.89కోట్ల మందిని తొలగించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో 1.26కోట్ల మంది వలస వెళ్లినట్లు తెలుస్తోంది. 31న రిలీజ్ చేసే లిస్టులో అభ్యంతరాలు ఉంటే JAN 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ రాష్ట్ర CEO నవదీప్ రిన్వా తెలిపారు. FEB 28న తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు.

News December 27, 2025

గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు టోకరా

image

తాడికొండ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం చీటింగ్ కేసు నమోదైంది. రావెల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు వీలేటి నాగచైతన్య వివరాల మేరకు.. మైలబత్తుల బాబు మహేష్, బాలరామ్, నందా కలిచ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఆఫర్ లేఖ చూపించి, రూ.5 లక్షలు తీసుకున్నారన్నారు. అనంతరం కంపెనీకి వెళ్లగా, ఆ ఆఫర్ లేఖ నకిలీదని తేలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.

News December 27, 2025

ఆల్కహాల్ కొంచెం తాగినా.. నోటి క్యాన్సర్ ముప్పు!

image

ఆల్కహాల్ కొంచెం తాగినా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా స్టడీలో వెల్లడైంది. మద్యం తీసుకోవడానికి సురక్షితమైన పరిమితి లేదు. ప్రతిరోజూ నిర్దిష్ఠ పరిమితిలో తాగినా ఓరల్ మ్యూకోసల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 50% ఉంటుంది. లోకల్ తయారీ మద్యంతో ఆ ప్రమాదం ఎక్కువ. పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారికి నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ 4రెట్లు ఎక్కువ. భారత్‌లో లక్ష మంది మగవారిలో 15మందికి నోటి క్యాన్సర్ వస్తోంది.