News April 12, 2025

హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలు శనివారం ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. శోభాయాత్రలకు పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు, రూమర్లు నమ్మవద్దని సూచించారు. రూమర్లను ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

News January 12, 2026

విశాఖ: కొడుకుతో బైక్‌పై వెళుతున్న తల్లి.. ప్రమాదంలో మృతి

image

నగరంలోని బర్మా క్యాంపునకు చెందిన రమణి తన కొడుకుతో బైక్‌పై రమా టాకీస్ వైపు వెళుతుండగా బైక్ హ్యండిల్‌కు బస్సు తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. అనంతరం RTC బస్సు వెనుక చక్రం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తల్లి మృతి చెందడంతో కుమారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన తీరు కంటతడి పెట్టింది. ద్వారక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 12, 2026

మేడారం జాతర బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, గిరిజన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 18న మేడారానికి వస్తున్న సీఎం, 19న పూర్తయిన అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తారు.