News April 12, 2025

కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్‌పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News January 21, 2026

MHBD: నేటి నుంచి జంతుగణన!

image

జిల్లాలో జంతు సంపాదన శాస్త్రీయంగా అంచనా వేసే దిశగా అటవీ శాఖ బుధవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ పరిధిలో గణన ప్రారంభం కానుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జంతువుల లెక్కింపు కార్యక్రమం ఈసారి నూతన AI టెక్నాలజీతో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్ విధానాలను వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News January 21, 2026

HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

image

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.

News January 21, 2026

HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

image

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.