News April 12, 2025

NRML: మూడు రోజులే గడువు..APPLY NOW

image

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ సీఈఓ గోవింద్, మండల ఎంపీడీవో పుష్పలత సూచించారు. నర్సాపూర్(జి) మండలంలోని నందన్ గ్రామపంచాయతీలో పలువురు అధికారులు, గ్రామస్తులతో మాట్లాడారు. కులవృత్తులు చేసుకునే వారికి, నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

Similar News

News October 18, 2025

సోలార్ యూనిట్లు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం మాట్లాడుతూ.. దీపావళి రోజు వాతావరణం కలుషితం చెయ్యని క్రాకర్స్‌ను మాత్రమే వెలిగించాలని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చెయ్యాలని కోరారు.

News October 18, 2025

సంగారెడ్డి: జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం కావాలి

image

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు విద్యార్థులు ప్రయోగాలు చేసి సిద్ధం కావాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి శనివారం తెలిపారు. నవంబర్ నెలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేయించాలని సూచించారు.

News October 18, 2025

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

image

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <>గెజిట్<<>> జారీచేసింది. 2019లో BPS ద్వారా 2018 ఆగస్టు వరకు ఉన్న నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేశారు. అయితే తాజాగా 59,041 అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీటి క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్‌ను 2025 ఆగస్టు 31గా సవరించారు. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.