News April 12, 2025

హనుమకొండ: గంజాయితో పట్టుబడిన ముగ్గురు అరెస్ట్

image

హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక కిలో 750 గ్రాముల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Similar News

News November 14, 2025

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

image

AP: భవిష్యత్‌ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్‌లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

News November 14, 2025

పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.