News April 12, 2025

తెలంగాణలో టాప్‌ 3లో ఉమ్మడి ADB

image

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4350 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 30, 2025

ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

image

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.

News December 29, 2025

38 ఫిర్యాదులు నమోదు: ADB ఎస్పీ

image

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయనతో పాటు శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, సీసీ కొండరాజు, కవిత, వామన్ ఉన్నారు.

News December 25, 2025

ADB: ఆన్లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

image

ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.