News April 12, 2025

KMR: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్..!

image

అంతర్రాష్ట్ర దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. KMR ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం మీడియాతో తెలిపిన వివరాలిలా.. గత కొన్ని నెలలుగా కామారెడ్డి హైవే 44 పై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి 7 గురిని పట్టుకున్నామన్నారు. వారి నుంచి మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని SP తెలిపారు.

Similar News

News November 12, 2025

జోగులాంబ దేవస్థానం టెండర్లు పూర్తి

image

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం టెండర్లు నిర్వహించారు. మొత్తం 14 రకాల టెండర్లకు పిలవగా… ఫొటోలు, క్యాసెట్ల అమ్మకం: రూ.22.60 లక్షలు (వెంకట్రాంరెడ్డి), సౌచాలయం నిర్వహణ: రూ.9.10 లక్షలు (నాగరాజు), సీల్డ్ టెండర్ (లడ్డు కవర్లు): శ్రీదేవి ఏజెన్సీ, సీల్డ్ టెండర్ (టెంట్ హౌస్): శ్రీనివాసులు మిగతా టెండర్లకు ఎవరూ రాకపోవడంతో వాటిని వాయిదా వేశారు.

News November 12, 2025

మరిపెడ: ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!

image

మరిపెడ మండలం తానంచర్ల ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని ఆముదాలగడ్డ తండాకు చెందిన భారతి-లక్ష్మ రెండవ కుమారుడు బావ్ సింగ్ ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించాడు. రైల్వే శాఖలో జేఈగా, నేషనల్ థర్మల్ పవర్‌లో ఈఈగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతంలో జాయిన్ అయ్యారు. ఒకేసారి రెండు కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఎన్నికైన భావ్ సింగ్‌కు స్నేహితులు, గ్రామస్థులు అభినలు తెలిపారు.

News November 12, 2025

ఉపరాష్ట్రపతి విశాఖ పర్యటన వివరాలు

image

ఈనెల 14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 8.30 ఎయిర్ పోర్టు నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబుతో కలసి ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 8.55కు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15కు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ మేరకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి ఏర్పాట్లు చేస్తున్నారు.