News April 12, 2025
ఖానాపూర్: లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

లయన్స్ క్లబ్ ఆఫ్ ఖానాపూర్ అన్నదాత నూతన అధ్యక్షుడిగా సాదుల వెంకటస్వామి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాచమల్ల రాజశేఖర్, కోశాధికారిగా పి.రాంచందర్ ఎన్నికయ్యారు. శుక్రవారం లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320డి అదనపు క్యాబినేట్ సెక్రటరీ ఎం.రాజన్న హాజరై 2025–26 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించారు.
Similar News
News March 12, 2026
MNCL: క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
News March 12, 2026
సిరిసిల్ల: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు కామారెడ్డి వెళ్లేందుకు బస్టాండ్లోకి వస్తుండగా.. ఎదురుగా వచ్చిన 102 అంబులెన్స్ అదుపుతప్పి బస్సును ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News March 12, 2026
కడపల్లి KSS సారథిగా CM చంద్రబాబు

శాంతిపురం(M) కడపల్లి కుటుంబ సాధికార సారథిగా CM చంద్రబాబు తన పేరు నమోదు చేసుకున్నారు. CM చంద్రబాబు నివాసం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఉండడంతో ఆ పంచాయతీ పార్టీ ప్రతినిధిగా నిర్దిష్ట బాధ్యతలను నిర్వర్తించనున్నారు. తిమ్మరాజు పల్లి బూత్ నంబర్ 49లో ఓటరు క్రమసంఖ్య 181 నుంచి 240 వరకు 60 మంది ఓటర్లను కలవనున్నారు. గత ఏడు జులై 2న CM చంద్రబాబు తిమ్మరాజు పల్లిలో పర్యటించారు.


