News April 12, 2025
పాడేరు: త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ను కలెక్టర్ దినేశ్ కుమార్ పాడేరు ఐటీడీఏలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీన అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా జరుగుతుందని, మే 2వ తేదీన పాడేరులో, అదేవిధంగా జూన్ 6వ తేదీన రంపచోడవరంలో ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 21, 2026
మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు: ఎస్పీ పరితోశ్

జహీరాబాద్ పట్టణంలోని ఎన్ఎస్ కన్వెన్షన్ హాల్లో ‘అరైవ్ అలైవ్–2026’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ పాల్గొని విద్యార్థులు, ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆర్ఎల్ఆర్ పాఠశాల విద్యార్థి సిద్దేశ్వర్ ప్రదర్శనను ఎస్పీ అభినందించారు. జనపద కళాకారుల పాటలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News January 21, 2026
రైలును పట్టాలు తప్పించే కుట్ర!

మహారాజా ఎక్స్ప్రెస్కు పెను ముప్పు తప్పింది. రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర చేశారు. పట్టాలపై ఇనుప కడ్డీలను పెట్టారు. లోకో పైలట్ వెంటనే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. ఇనుప కడ్డీలను తొలగించి, డాగ్ స్క్వాడ్, పోలీసుల తనిఖీల తర్వాత రైలును పంపారు.
News January 21, 2026
దావోస్లో కేటుగాళ్లు.. బిలియనీర్లకే బురిడీ

దావోస్లో కేటుగాళ్లు మాటువేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో బిలియనీర్లను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యేందుకు ‘USA హౌస్’లోకి వీఐపీ యాక్సెస్ కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు స్కామర్లు నకిలీ టికెట్లను విక్రయించడం గమనార్హం. ఈ విషయం బయటపడటంతో జాగ్రత్తగా ఉండాలంటూ బిలియనీర్లను USA హౌస్ హెచ్చరించింది. ‘మోసపోయిన వారికి మా సానుభూతి’ అంటూ పేర్కొంది.


