News April 12, 2025

విశాఖ మీదుగా కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ -కర్నూలు (08545/46) ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు, విశాఖ -బెంగళూర్ (08581/82) ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు, విశాఖ -తిరుపతి (08547/48) ఏప్రిల్ 16 నుంచి మే 28 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News April 14, 2025

‘కేజీహెచ్‌లో అందుబాటులో అన్నిరకాల మందులు’

image

కేజీహెచ్‌లో రోగులకు అందుబాటులో అన్ని రకాల మందులు ఉన్నాయని సూపరింటెండెంట్ శివానంద్ ఆదివారం తెలిపారు. కెజీహెచ్‌లో రూ.1.5 కోట్ల విలువ గల అన్ని రకాల మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రోగులకు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మందులను వారం రోజులకు సరిపడనట్లు ఇస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 90 రోజులకు సరిపడే విధంగా మందులు ఇస్తున్నామన్నారు. 

News April 13, 2025

జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

image

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2025

కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన హోం మంత్రి

image

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు కైలాసపట్నం అగ్ని ప్రమాద బాధ్యతల్ని ఆదివారం హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడం బాధాకరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్‌ని ఆదేశించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఆమె వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.

error: Content is protected !!