News April 12, 2025

కంచిలి: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె

image

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన పి జగన్మోహిని అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె కుమారుడు శివాజీ బెంగళూరులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరణ వార్త తెలిసి వచ్చినప్పటికీ ఆయన భార్య గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అవివాహితగా ఉన్న కుమార్తె నాగమ్మ తన తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేశారు.

Similar News

News September 12, 2025

శ్రీకాకుళం: 27 వరకు ప్యాసింజర్ రద్దు

image

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా బ్రహ్మపూర్- విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నంబర్ (58531, 58532) గల ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి 27 వరకు రద్దు చేస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.

News September 12, 2025

SKLM: రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

image

రైతులు ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు పలువురు రైతులు ఫోన్ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. రైతుల వివిధ రకాల సమస్యలను తెలుసుకుని సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు రైతులకు కాన్ఫరెన్స్ ఫోన్ కాల్‌కి తీసుకొని ఎరువులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News September 11, 2025

నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

image

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.