News April 12, 2025
కంచిలి: తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన పి జగన్మోహిని అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె కుమారుడు శివాజీ బెంగళూరులో వలస కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరణ వార్త తెలిసి వచ్చినప్పటికీ ఆయన భార్య గర్భిణి కావడంతో అంత్యక్రియలు చేసేందుకు అవకాశం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో అవివాహితగా ఉన్న కుమార్తె నాగమ్మ తన తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేశారు.
Similar News
News April 21, 2025
శ్రీకాకుళం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ ద్వారా 458 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-184 ➤ BC-A:35 ➤ BC-B:41 ➤ BC-C:6 ➤ BC-D:32 ➤ BC-E:20 ➤ SC- గ్రేడ్1:8 ➤ SC-గ్రేడ్2:27➤ SC-గ్రేడ్3:36 ➤ ST:25 ➤ EWS:44.
News April 21, 2025
నౌపడ: కోడిపందాలు కేసులో ఐదుగురి అరెస్ట్

సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన దాడుల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెంకి వినియోగించిన సామగ్రి తో పాటు రూ. 3,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి కేసు నమోదు చేశారు.
News April 21, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.