News April 12, 2025
25 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

భారత సైన్యంలో అగ్నిపథ్ ద్వారా అగ్నీవీర్ నియామకాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 25 వరకు పెంచినట్లు గుంటూరు రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. జూన్లో జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 13 భాషల్లో, వాటిలో తెలుగులోనూ నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల అభ్యర్థులు అగ్నీవీర్ టెక్నికల్, జీడీ, ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 1, 2026
ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ పరీక్ష

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1, 2, 3, 4 తో పాటు RRB, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.


