News April 12, 2025

బద్వేల్: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆదిత్య రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు దేవసాని ఆదిత్య రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తనపై నమ్మకంతో కీలకమైన స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు.

Similar News

News November 10, 2025

కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

image

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2025

ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

image

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 10, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్‌ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.