News April 12, 2025

మహబూబ్‌నగర్: ‘భారీగా మామిడి పండ్ల ధరలు’ 

image

వేసవి కాలం నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లలో మామిడి పండ్ల కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రస్తుతం మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఒక్కో బాక్స్‌కు ధర రూ.7,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని చెప్పారు. రిటైల్ మార్కెట్‌లో కేజీ ధర రూ.150 నుంచి రూ.250 వరకు అమ్మడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉంది.. కామెంట్ చేయండి.

Similar News

News October 21, 2025

నస్రుల్లాబాద్: వృద్ధురాలి హత్య.. నగలు దోపిడీ (UPDATE)

image

నస్రుల్లాబాద్(M) అంకోల్ తండాలో <<18063585>>వృద్ధురాలి హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. రాధీ బాయి ఒంటరిగా నివసిస్తుంది. సోమవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సవాయిసింగ్ ఇంట్లోకి వెళ్లి రాధీ బాయిని గొడ్డలితో నరికి ఆమెపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీన్ని చూసిన లక్ష్మీ అనే మహిళ ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సవాయిసింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

News October 21, 2025

జగిత్యాల: ‘సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం’

image

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలలో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జ్ఞాపికలను అందజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని SP, కలెక్టర్ హామీ ఇచ్చారు. పలువురు పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు .

News October 21, 2025

తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.