News April 12, 2025
త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు గాను తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. AP CM చంద్రబాబు దీనికి సంబంధించి మొదటి అడుగు వేసే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, రేవంత్ గత ఏడాది జులైలో ప్రజాభవన్లో తొలిసారి సమావేశమైనా చాలా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. వాటన్నింటిపై ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News March 21, 2026
ఇరాన్కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్లో షియా, పాక్లో సున్నీ ముస్లింలు ఎక్కువ.
News March 21, 2026
వారంలో ఐపీఎల్.. ఆ ప్లేయర్లు ఆడటం డౌటే!

వారంలో IPL మొదలవనుండగా తమ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు మెలిక పెట్టింది. ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేందుకు NOC ఇవ్వాలంటే ఫిట్నెస్ పరీక్షల్లో పాసవ్వాలని స్పష్టం చేసింది. DC ప్లేయర్లు చమీరా, నిస్సంక, కమిందు మెండిస్(SRH) ఫిజికల్ టెస్టును క్లియర్ చేశారు. గాయాల పాలైన హసరంగ(LSG), నువాన్ తుషార(RCB), పతిరణ(KKR), ఈషాన్ మలింగ(SRH) ఇంకా టెస్టులో పాల్గొనలేదు. దీంతో వీరు IPLలో పాల్గొనడంపై అనుమానం నెలకొంది.
News March 21, 2026
వచ్చే వారం భీకర దాడులు: ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. వచ్చే వారం ఇరాన్పై దాడుల తీవ్రతను పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్, కమాండర్లు, కీలక స్థావరాలను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్పై దాడులను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


