News April 12, 2025
ఇంటర్లో కోనసీమ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేనా…

ఇంటర్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తారన్న ధీమా అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్లో 17, సెకండ్ ఇయర్లో 16వ స్థానంలో కోనసీమ నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13,431, సెకండ్ ఇయర్లో 13,881, మొత్తం 27,312 మంది పరీక్షలు రాశారు. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News October 25, 2025
బాబా ఫరీద్ యూనివర్సిటీలో 348 ఉద్యోగాలు

పంజాబ్లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ 348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 40 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://recruitment.ggsmch.org/
News October 25, 2025
KSRTC బస్సుకు తప్పిన ప్రమాదం

పుట్టపర్తి మండలంలోని వెంకటగారిపల్లి గ్రామ సమీపంలో పుట్టపర్తి-గోరంట్ల ప్రధాన రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. పుట్టపర్తి నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తుండగా బస్సు స్టీరింగ్ కట్ అయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో డివైడర్ వైపు దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
News October 25, 2025
ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


