News April 12, 2025
కడప: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్ ఫలితాలు ఇవాళ 11 గంటలకు రానున్నాయి. కడప జిల్లాలో మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 13, 2025
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
News April 13, 2025
కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్ ఫలితాలు ఇవే..

☛ 2021 అకడమిక్ ఇయర్లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.
News April 13, 2025
వేంపల్లి: 10వ తరగతి బాలికపై అత్యాచారం

వేంపల్లి మండలంలోని పదో తరగతి బాలికపై ఫాజిల్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ‘ఇటీవల బాలికను వేంపల్లె గాంధీరోడ్డులో చికెన్ దుకాణంలో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసును నమోదు చేశాం. అలాగే అతడికి సహకరించారని చికెన్ దుకాణం ఓనర్ ఆనంద్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ తెలిపారు.