News April 12, 2025
NTR: ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూపులు..!

ఎన్టీఆర్ జిల్లాలో 80,859 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,295 మంది ఫస్టియర్, 39,564 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News March 22, 2026
‘వాట్సాప్’ల్లోనే అమ్మాయిల వివరాలు: నెల్లూరు ASP

నెల్లూరులో <<19448814>>వ్యభిచార<<>> ఘటనపై ASP దీక్ష మాట్లాడారు. ‘గతవారమే మాకు సమాచారం వచ్చింది. చిన్నబజార్లోని నాలుగు లాడ్జిల్లో సోదాలు చేశాం. లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD, బెంగళూరు నుంచి రప్పించి వారి ఫొటో, రేట్ నిర్ణయించి కస్టమర్కు వాట్సాప్ చేస్తారు. దీంతో ఇవాళ మా టీమ్తో దాడులు చేశాం. ఓ అమ్మాయితో నలుగురు విద్యార్థులు ఉండగా పట్టుకున్నాం. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేశాం. కేసు నమోదు చేస్తాం’ అని ASP తెలిపారు.
News March 22, 2026
ఖాతాల్లోకి డబ్బులు.. 3 రోజులే ఛాన్స్

TG: రైతుభరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్లికేషన్ ఫామ్తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి వివరాలకు AEOలను సంప్రదించాలి.
News March 22, 2026
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాక్ టాప్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.


