News April 12, 2025
డోన్లో మెగా జాబ్ మేళా: కలెక్టర్ రాజకుమారి

జాబ్ మేళా ద్వారా యువత మెరుగైన ఉపాధి పొంది, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జీవిఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 16న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు naipunyam.ap.gov.in సంప్రదించాలన్నారు.
Similar News
News September 17, 2025
ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.
News September 17, 2025
HYD: రోడ్లపై చెత్త వేస్తే ఒక్కో రకంగా జరిమానా

గ్రేటర్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అనేక చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా.. ఫలితం లేకుండా పోతోంది. గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే రూ.1,000 జరిమానా వేస్తామని బోర్డులపై ఉండగా, అదే బోడుప్పల్ కార్పొరేషన్లలో రూ.25,000 జరిమాన వేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ కంటే కార్పొరేషన్లలోనే అధికంగా జరిమానా ఉన్నట్లు తెలుస్తోంది.
News September 17, 2025
ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి, తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 1940లో, జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.