News April 12, 2025

SBI ఫెలోషిప్‌.. ప్రతి నెలా రూ.19,000

image

యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌నకు SBI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు గ్రామాల్లోని సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ₹16K స్టైఫండ్, రవాణా, ఇతర ఖర్చులకు ₹3K ఇస్తారు. ప్రోగ్రామ్‌ను పూర్తిచేసిన వారికి ₹90K ఇస్తారు.
వెబ్‌సైట్: <>https://youthforindia.org/<<>>

Similar News

News January 9, 2026

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా?

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్ర్యానికి దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. ‘దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు. కుబేర యోగం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 9, 2026

కొత్త బీడీ పొగాకు రకం ‘ABD 132’.. దీని ప్రత్యేకత ఏమిటి?

image

ABD 132 బీడీ పొగాకు రకాన్ని నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకం పంటకాలం 195 నుంచి 210 రోజులుగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేయడానికి ఈ రకం అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర బీడీ పోగాకు రకాలతో పోలిస్తే దీని పొగలో హానికర అంశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.

News January 9, 2026

విద్యుత్ ఛార్జీలపై సీఎం గుడ్ న్యూస్

image

AP: కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ ₹5.19గా ఉండేదని, దాన్ని ₹4.90కి తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్చి నాటికి మరో 10 పైసలు, మూడేళ్లలో ₹1.19 తగ్గించి యూనిట్ ₹4కే అందిస్తామన్నారు. 2019-24 నాటి ట్రూఅప్ ఛార్జీల భారం ₹4,498 కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం గందరగోళ నిర్ణయాలు అమలు చేసిందని విమర్శించారు.